ధర్పల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకల నిర్వహించిన మహిళలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి లొ నాగుల పంచమి పండుగను మహిళలు, ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్థానిక పుట్టల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని నాగదేవతలకు ప్రత్యేక పూజలు సమర్పించారు. నాగదేవత విగ్రహాలకు, పుట్టలో పాలు సమర్పించి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లతో అలంకరించి అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ.. నాగదేవత ఆశీస్సులతో గ్రామంలోని కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, వ్యాధులు నశించి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఆలయాలు, పుట్టల ప్రాంగణాలు భక్తుల నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

























