ధర్పల్లిలో మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్వసభ్య సమావేశం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండల కేంద్రంలో తేదీ25-08-2026 మంగళవారం రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ముఖ్యమైన సర్వసబ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు రామగిరి రామగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మేధావులు, విద్యావంతులు, బి సి, ఎస్సి, ఎస్టీ , సంఘాల నాయకులు పాల్గొని
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సంక్షేమ పథకాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మండల పరిధిలోని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు, యువకులు, మహిళలు మరియు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లొ సంబె టి సుమన్, కరికేల్లి మహిపాల్, చలిమెల నర్సయ్య , వి.బాలయ్య, రఘురాం మచ్చ, మంచి కంటి ప్రశాంత్, లు తదితరులు పాల్గొన్నారు.

























