ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్..
నందిపేట్ ఆగస్టు 22 త్రిశూల్ న్యూస్ : రోడ్డెక్కిన ప్రతి ద్విచక్ర వాహన చోదకునికి ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే శిక్ష తప్పదని నందిపేట ఎస్సై వినయ్ కుమార్ హెచ్చరించారు.
డొంకేశ్వర్ నందిపేట మండలం ప్రజలకు తెలపడం ఏమనగా జిల్లా కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆగస్టు 22 నుండి ద్విచక్రాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ను ధరించాలని, వాహనం నడిపే వ్యక్తే కాకుండా వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని లేదంటే మోటార్ వెహికల్ ఆక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి వాహనాన్ని ఫీజు చేయబడుతుందని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ద్విచక్ర వాహన ప్రమాదాలలో హెల్మెట్ లేక మృతి చెందే వారె అధికమని, తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో చాలామంది కోమాలోకి వెళుతున్నారని గుర్తు చేశారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రమాద రూపంలో కోల్పోతే… ఆ కుటుంబంలో జీవితాంతం సంతోషాలు కరువైతాయని దయచేసి వాహనదారులంతా హెల్మెట్లను ధరించి తమ కుటుంబాల కొరకైన రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

























