కమ్మర్ పల్లి వాలీబాల్ అసోసియేషన్ క్రీడాకారులకు క్రీడా దుస్తుల వితరణ…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
-కమ్మర్పల్లి vdc చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడాకారులకు వీడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్, మాజీ ఎంపిటిసి మైలారం సుధాకర్ క్రీడా దుస్తులను ఆవిష్కరించి క్రీడాకారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, నిజామాబాద్ లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ క్రీడల్లో కమ్మర్ పల్లి క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
గతంలో రెండు సార్లు నిజామాబాదులో జరిగిన వాలీబాల్ క్రీడల్లో కమ్మర్ పల్లి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి అందుకున్నట్లు గుర్తు చేశారు.
నిజామాబాదులో జరిగే వాలీబాల్ క్రీడల్లో విజయం సాధించి కోయంబత్తూర్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు క్రీడాకారులు వెళ్లేందుకు విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ తాను సొంత ఖర్చులతో పంపిస్తానని తెలిపారు.
కోయంబత్తూరు లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలిచి మొదటి బహుమతి గెలుపొందలని ఆకాంక్షించారు.

























