కేబినెట్ లోకి రాములమ్మ.!
కొండా సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలి అని హైకమాండ్ నిర్దేశించినట్లు తెలుస్తుంది.
సురేఖ పై వేటుతో అధికార కాంగ్రెస్ లో రాజకీయం మారుతోంది. కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం.
ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు తరువాత సురేఖ పైన వేటు వేస్తూనే.. ఒకే సారి ముగ్గురు మహిళలకు పదవులు కట్టబెట్టారు.
కాగా, ఇక.. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి. త్వరలోనే మంత్రివర్గం ప్రక్షాళన ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్సీ విజయ శాంతికి మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ బలోపేతానికి వాడుకోవాలని రాష్ట్ర నాయకత్వాని కి సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఎందుకంటే కొండా సురేఖ పార్టీని వీడి రేపటి రోజున కాంగ్రెస్ మీద నిప్పులు చెరగడం ఖాయమని.. ఆమెను ఢీ కొట్టేందుకు విజయశాంతికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

























