నాగపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని నాగపూర్ గేట్ సమీపంలో జాతీయ రహదారి-44పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నిర్మల్ జిల్లా మంగళిపూర్కు చెందిన బి. బోజన్న (45) ప్రమాదంలో మృతి చెందారు. అదే కారులో ఉన్న మార్జలాపూర్ గ్రామానికి చెందిన మనోజ్ మల్కాంగ్ (27), గంగాధర్ మల్లన్న (40) తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న డిచ్పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై డిచ్పల్లి ఎస్సై ఎం.డి. అరీప్ దర్యాప్తు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన బోజన్నకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

























