ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: సీఎం హామీ
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి ని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ప్రాతినిధ్యం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యంగా పీఆర్సీ (PRC), పెండింగ్ డీఏలు (DA), CPS రద్దు – OPS పునరుద్ధరణతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చించి, పీఆర్సీ, డీఏ, సీపీఎస్ తదితర డిమాండ్ల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల TGEJAC నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం TGEJAC నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో TGTA అధ్యక్షులు S రాములు
ప్రధాన కార్యదర్శి పాక రమేష్,TGRSA అధ్యక్షులు బాణాల రాంరెడ్డి GPOATG గరికె ఉపేంద్ర రావు లు ఉన్నారు.

























