హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విజయవంతం
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ) దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను ఛేదించింది. జార్ఖండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ముఠా ప్రధాన సూత్రధారి సత్యం మిశ్రాను అరెస్టు చేశారు. ఈ ముఠా వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా ఆర్డర్లు స్వీకరించి, యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసి, మెడిసిన్ పార్సిల్స్ పేరుతో గంజాయిని నేరుగా కస్టమర్ల ఇళ్లకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపుతున్నట్లు దర్యాప్తులో తేలింది.























