గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి గ్రామం లో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఎమ్మెల్యే ను కలిసిన కొరట్ పల్లి గ్రామ పార్టీ శాఖ నూతన కార్యవర్గం డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.పార్వతి గంగాధర్,రవీందర్ రెడ్డి, నూతన కార్యవర్గం స్థానిక మండల పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, జహూర్ స్థానిక సర్పంచ్.ప్రభాకర్ ల నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను శాలువతో సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.గ్రామస్థాయిల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.ఈకార్యక్రమంలోఉపాధ్యక్షులు. గుర్రపు ఉషన్న,కోశాధికారి. సంతోష్,నవీన్ రెడ్డి,మోహన్, దిలీప్,శంకర్, గంగారాం,ప్రసాద్,ప్రవీణ్ రెడ్డి, కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
























