తిమ్మాపూర్లో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం – బీఎల్ఓలు, సూపర్వైజర్లకు పత్రాలు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ సోమ రాజేశ్వర్…
ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సోమ రాజేశ్వర్ శనివారం తన స్వగ్రామమైన తిమ్మాపూర్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 87వ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్యూమరేషన్ పత్రాలను సంబంధిత బూత్ లెవల్ అధికారులు (BLOలు) మరియు సూపర్వైజర్లకు అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనదని తెలిపారు. గ్రామంలోని ప్రతి అర్హుడైన ఓటరిని గుర్తించి, వారి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని బీఎల్ఓలకు సూచించారు. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయడంతో పాటు, వాటిని సక్రమంగా నింపేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులైన యువతను ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు, చిరునామా మార్పు, పేరు సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని బీఎల్ఓలు, సూపర్వైజర్లకు సూచించారు.
ప్రతి కుటుంబాన్ని తప్పనిసరిగా సందర్శించి, అవసరమైన పత్రాలను పరిశీలించి మాత్రమే వివరాలను నమోదు చేయాలని, ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని ఓర్పుతో నివృత్తి చేయాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించగలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల సిబ్బంది, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

























