డిచ్పల్లి ఖిల్లా రామాలయ కమిటీ నూతన కార్యవర్గం నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని చారిత్రాత్మక ఖిల్లా రామాలయం, హనుమాన్ ఆలయాల నూతన పాలకవర్గాలను నియమించారు. ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్గా అప్పాల గంగాదాస్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్గా మారు రఘుపతి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, ఆలయాల అభివృద్ధికి నూతన కార్యవర్గం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాల ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఖిల్లా రామాలయ కమిటీ సభ్యులు అశోక్, బుస రవి, చెలిమెల వినయ్, ఆర్మూర్ లలిత, కృష్ణమాచారి పాల్గొన్నారు. అలాగే హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు సుర శ్యామ్, ఆడెపు రాజు, కొంగ ప్రవీణ్, చిన్న ముత్తవ్వ, కృష్ణమాచారి పాల్గొన్నారు.
అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

























