తెలంగాణలో మద్యం ధరల పెంపు.. ఎల్లుండి నిర్ణయం!
తెలంగాణ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఎంత మేరకు పెంచాలనేదానిపై ఈ నెల 17న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ధరల నిర్ణయ కమిటీ ఇప్పటికే తయారీ సంస్థలు, అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ మీటింగ్లో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ బాటిళ్ల సైజుల్లోనూ మార్పులు చేయాలని కంపెనీలు కోరుతున్నట్లు సమాచారం. 150ml బాటిళ్లను తెచ్చే అంశం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది.























