CBSE ఫలితాలు విడుదల…
లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మే 15 నుంచి 21 వరకు జరిగిన ఈ పరీక్షలకు 6,64,027 మంది రిజిస్టర్ చేసుకోగా, 6,63,777 మంది హాజరయ్యారు. ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన 5,13,955 మందిలో 3,08,095 మంది (59.95%) స్కోరును మెరుగుపరుచుకున్నారు. కంపార్టుమెంట్ కేటగిరీలో 1,49,822 మంది రాయగా, 78,503 మంది (52.40%) ఉత్తీర్ణులయ్యారు. మొదటి, రెండో విడత కలిపి పదో తరగతి ఉత్తీర్ణత శాతం 96.78%గా నమోదైంది.























