SIR ఎన్యూమరేషన్ 100% పూర్తి చేయాలి – ముత్యాల సునీల్ రెడ్డి…
మిగిలిన ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్వోలు, బీఎల్ఏలకు సూచన…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మర్పల్లి, జూలై 20: కమ్మర్పల్లి మండల కేంద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఇంకా మిగిలి ఉన్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా బీఎల్వోలు, బీఎల్ఏలు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, వంద శాతం ఓటర్ల ఎన్యూమరేషన్ పూర్తయ్యే వరకు విశ్రాంతి లేకుండా కృషి చేయాలని కోరారు.
SIR ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి, ఓటరు జాబితాను సమగ్రంగా రూపొందించే దిశగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ముత్యాల సునీల్ రెడ్డి సూచించారు.

























