ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డుకు మరమ్మత్తులు చేయండి…
ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గానికి మరమ్మతులు చేయించాలని భీంగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ…. ప్రభుత్వ కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గం గుంతలతో ఉండడం వల్ల చిన్నపాటి వర్షానికి బురదమయం అవడంతో విద్యార్థులు, అధ్యాపకులు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని రానున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని తాత్కాలికంగా మరమ్మత్తులు చేయించి వీలైనంత త్వరగా బీటీ రోడ్డు వేయాలని మున్సిపల్ కమిషనర్ వినతిపత్రం సమర్పించామని సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ త్వరితగతిన పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తామని తెలిపారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యు ఐ నాయకులు సుబ్బు, అశ్విత్ ,విష్ణు, మనోజ్ ,సుశాంత్, అఫన్ ,అక్షిత్ ,మహేష్ , శ్రీనిథ్ ,అభిలాష్ ,అశోక్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

























