ఆర్మూర్ డిపోలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్.కే నగేష్…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపోలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీమతి ప్రతిమారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ఉద్యోగులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్మికుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అదేవిధంగా కార్మికులు కోరుకుంటున్న డ్యూటీ విధానంలో స్పెషల్ ఆఫ్ విధానాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలించి త్వరలో అమలు చేస్తామని తెలిపారు. డిపో ఆదాయం తగ్గుతున్న పరిస్థితులను కూడా ఉద్యోగులు అర్థం చేసుకోవాలని, సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
“కార్మికుల సంక్షేమంతో పాటు సంస్థ అభివృద్ధి కూడా ముఖ్యమే. ఆర్మూర్ డిపోను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం” అని డిపో మేనేజర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో STI గారు, విజేందర్, సూపరింటెండెంట్ ఇన్చార్జి సత్తయ్య , DVS చక్రవర్తి, జగదీష్ , పోచయ్య, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ బలరాం, మనోహర్ కానిస్టేబుల్, SM యాదగిరి, కార్తీక్, కే. నగేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్మూర్ డిపోకు చెందిన అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

























