పన్నులు సకాలంలో చెల్లించాలి: గ్రామ కార్యదర్శి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాల సముదాయాల్లోని వ్యాపారులు తమ బకాయి పన్నులను సకాలంలో చెల్లించాలని గ్రామ కార్యదర్శి రాకేష్ సూచించారు.
మంగళవారం గ్రామపంచాయతీ సిబ్బంది పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బకాయి పన్నులను చెల్లించకపోతే గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతుందని కార్యదర్శి తెలిపారు. వ్యాపారులు తమ పన్ను బకాయిలను వెంటనే చెల్లించి గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది గంగాధర్, సామేందర్, రాజేందర్, ప్రవీణ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

























