ధర్పల్లిలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘం భవనానికి అధికారులు భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఎంపీడీవో బి. మారుతి, ఎంపీవో శ్రీధర్, హౌసింగ్ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

























