మినీ జాబ్ మేళాకు విశేష స్పందన – వేల్పుల విజేత, జిల్లా ఉపాధి కల్పనాధికారిణి నిజామాబాద్…
ఈరోజు స్థానిక జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, శివాజీ నగర్ నందు జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఇట్టి జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి నిజామాబాద్ లోని స్థానిక ఫ్రూడెన్స్ హాస్పిటల్, అపోలో ఫార్మసీ, మహీంద్రా షోరూం లలో గల స్థానిక ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. ఫ్రూడెన్స్ హాస్పిటల్లో నర్సులు, రిసెప్షనిస్ట్ ఖాళీలకు, అపోలో ఫార్మసీ నందు ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్టు, అప్రెంటిస్ ఖాళీలకు, మహేంద్ర షో రూమ్ లో మేనేజర్లు, మెకానిక్ లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఖాళీలకు ఇంటర్వ్యూ నిర్వహించబడ్డాయి.

ఈ మినీ జాబ్ మేళాలో 168 మంది నిరుద్యోగులు పాల్గొనగా వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి 52 మందిని వివిధ ఖాళీలకు ఎంచుకున్నారు.వారికి వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు జిల్లా ఉపాధి కల్పనాదికారిణి శ్రీమతి వేల్పుల విజేత చేతుల మీదు గా అందచేశారు… వారికి జీతం 13,500 నుండి 18,000 వరకు ఇవ్వబడుతుంది.

ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనాధికారిణి శ్రీమతి వేల్పుల విజేత మాట్లాడుతూ స్థానిక ఖాళీలు వెతికి నిరుద్యోగ యువత కోసం స్థానిక జాబ్ మేళా ఏర్పాటు చేయబడిందని, దానిని సద్వినియోగం చేసుకున్న యువకులకు, నిరుద్యోగులకు శుభాకాంక్షలు తెలియచేశారు..ఇకపై ప్రతినెల స్థానిక ఖాళీలతో జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రకటించారు..గతంలో నిర్వహించిన విదేశీ మెగా జాబ్ మేళా నందు (4620) మంది నిరుద్యోగులు టామ్ కామ్ లో నమోదు కబడ్డారని, వారిలో మొదటి దశలో (120) మంది జర్మనీ దేశం లో ఉద్యోగాలకు ఎంపిక కాబడ్డారని తెలిపారు..వారి కొరకై వచ్చే వారంలో జర్మనీ భాష శిక్షణా తరగతులు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు…అందరు నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్టి జాబ్ మేళా నందు హెచ్ఆర్ లు కిరీటి, మారుతి,జపానియా, కార్యాలయ సిబ్బంది స్వాతి, అనిత్,సందీప్, సత్యనారాయణ,రవీందర్ తదితరులు పాల్గొన్నారు

























