మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాఖీ హోల్సేల్ దుకాణం ప్రారంభం…
గ్రామీణ స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజ రాఖీ హోల్సేల్ దుకాణాన్ని నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎర్రం లింగం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ స్వయం సాధికారత సాధించడం నిజమైన స్త్రీశక్తికి నిదర్శనం అని అన్నారు. మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. రాఖీ హోల్సేల్ దుకాణం విజయవంతంగా కొనసాగి, మహిళలకు మరింత ఆర్థిక స్వావలంబన కల్పించాలని ఆకాంక్షించారు.
స్త్రీశక్తి – స్వయం సమృద్ధి – సాధికారత అనే లక్ష్యంతో మహిళా సంఘాలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

























