సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు: కిషన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకే (SCCL) కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గనిని ఓపెన్ ఆక్షన్ (వేలం) లేకుండా నేరుగా సింగరేణికి ఇవ్వడం వల్ల సంస్థకు కనీసం రూ. 2,550 కోట్ల మిగులు ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా రూ. 64,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో TG ప్రభుత్వానికి దాదాపు రూ. 16,000 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది.























