గోనుగొప్పులలో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు ఉచిత మందుల పంపిణీ..
సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిహా హాస్పిటల్ వైద్య సేవలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిహా చిల్డ్రన్స్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలోని వైద్య బృందం గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసింది. శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భోజ గౌడ్, గట్టు భూమేష్, వీడీసీ అధ్యక్షుడు కానూరి మహేందర్, డాక్టర్ హరీష్, అనుపల బొర్రన్న, బోడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

























