ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన భీంగల్ మున్సిపాలిటీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
జాతిపిత మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు తోట సతీష్, అంజుమ్ ఆలీ, సంగ్యా నాయక్, సందీప్, ప్రజాప్రతినిధులు నాగేంద్రబాబు, అనంతరావుతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, ఆయన చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

























