నాగుల పంచమి సందర్భంగా GCR ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని GCR ట్రస్ట్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ధర్మశాల రోడ్ లో మరియు విద్యానగర్ సాయిబాబా టెంపుల్ గల పాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు భక్తులకు పాలు పంపిణీ చేసి, నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగుల పంచమి సందర్భంగా భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నాగదేవతను ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో GCR ట్రస్ట్ సభ్యులు, ఆకాష్, శశి, సాయి, ఓంకార్, లక్ష్మణ్ యాదవ్, రామ్ యాదవ్, శివ, అరుణ్, రామ్, సిద్దు, మధు,పాల్గొన్నారు.

























