కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్…
విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట – ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ (YIIRS) ఏర్పాటు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే కామారెడ్డి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా G.O.Rt.No.145, తేదీ 04-08-2026 ద్వారా కామారెడ్డి జిల్లా, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) కాంప్లెక్స్ భవన నిర్మాణానికి రూ.200.00 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు.
ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్యకు అవసరమైన విద్యా వాతావరణం, ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాలు, వసతి, భోజనం మరియు ఇతర మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని షబ్బీర్ అలీ తెలిపారు.
పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కామారెడ్డి విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించి, వారిని పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసంస్థల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు, ఆధునిక భవనాల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
కామారెడ్డిని విద్యా హబ్గా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యంలో భాగంగా ఈ రూ.200 కోట్ల ప్రాజెక్టు మరో కీలక ముందడుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. కామారెడ్డి నియోజకవర్గ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది
ఈ విద్యాలయ నిర్మాణం మండలంలో నిర్మించడం జరుగుతుందని మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో, మున్సిపల్ చైర్ పర్సన్, ఉమా శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్
మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

























