తెలంగాణ యూనివర్సిటీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నిర్వహించారు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
తెలంగాణ యూనివర్సిటీలో BC/SC/ST జేఏసీ ఆధ్వర్యంలో సామాజిక చైతన్యం, ఆత్మగౌరవం, విద్యార్థుల్లో అవగాహన మరియు బహుజన వర్గల సామాజిక–రాజకీయ ప్రాతినిధ్యం కొరకు సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శం తీసుకోనీ ముందుకు సాగాలని పిలుపు..ఈ కార్యక్రమంలో కన్వీనర్ గోపీచంద్ మహారాజ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చారిత్రక పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆయన జీవితం సామాజిక నేపథ్యం గురించి వివరించారు. రాజరిక వ్యవస్థ,జమీందారీ ఆధిపత్యం సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ చేసిన పోరాటం నుంచి నేటి యువత ఆత్మగౌరవం, సమానత్వం,సామాజిక న్యాయం వంటి విలువలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కో కన్వీనర్ విష్ణు గౌడ్ మహారాజ్ మాట్లాడుతూ
బీసీ,ఎస్సీ,ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు విద్య, ఉద్యోగాలు,సామాజిక అవకాశాలు ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ హక్కులు, రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకోవడంతో పాటు, సమాజ అభివృద్ధిలో బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని సూచించారు.సామాజికంగా వెనుకబడిన వర్గాల్లో ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం,సమానత్వం సామాజిక న్యాయంకోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పనిచేయడం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను స్మరించుకుంటూ,యువత విద్య మరియు సామాజిక అవగాహన ద్వారా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.“ఆత్మగౌరవం – సామాజిక చైతన్యం – సమానత్వం –సామాజిక న్యాయం” అనే విలువలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి యువత బాధ్యత అని పేర్కొన్నారు..
కార్యక్రమంలో రుషేందర్ మహారాజ్,చలామణి కాంత్ మహారాజ్,వినీల్ మహారాజ్,కలీం, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

























