సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి జిల్లాలోని భవిత హైస్కూల్లో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, వాటి నుంచి రక్షించుకునే విధానాలపై సైబర్ క్రైమ్ ఎస్ఐ నరేష్ అవగాహన కల్పించారు.

ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్ యాప్ల మోసాలు, డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాలు, KYC మోసాలు, UPI మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, పెట్టుబడి మోసాలు తదితర సైబర్ నేరాల గురించి వివరించారు.
అపరిచిత వ్యక్తులతో OTP, PIN, CVV, పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింకులు, QR కోడ్లు మరియు యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, సిబ్బందికి సూచించారు.
అలాగే, ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని అవగాహన కల్పించారు.
సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎస్ఐ నరేష్, D4C సిబ్బంది, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

























