మంత్రి పదవి కోరుకోవట్లేదు.. PCC చాలు: మహేశ్ గౌడ్…
తెలంగాణ : రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తాను మంత్రి పదవిని కోరుకోవడం లేదని, మరోసారి PCC చీఫ్గానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం చూపవని, ఆరు గ్యారంటీల్లో చాలా వరకు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.























