పోసానిపెట్లో ఘనంగా వనమహోత్సవం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్
రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్, శ్రీనివాస్, సునీత, బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగం, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కే. గంగారం, పోతుల బాపురెడ్డి, బండి పోచయ్య, బండి తిరుపతి, సాకలి సాయిలు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోత్స్న ప్రశాంత్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

























