కమ్మరపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
ఈ రోజు అసెంబ్లీ కి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సందర్భంలో బాల్కొండ శాసన సభ సభ్యులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ని ,
బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం నిరసిస్తూ కమ్మరపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా brs పార్టీ శ్రేణులు ఈ నిరసనలు చేస్తున్నారు.ఈ సందర్భంగా కమ్మరపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ,సీనియర్ నాయకుడు బద్దం చిన్న రెడ్డి లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ప్రభుత్వ వైఫల్యం ఎంద గడితే ఎక్కడిక్కడ అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల బి ఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























