నిజామాబాద్లో బీఆర్ఎస్ నిరసన.. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని అంబేద్కర్కు వినతిపత్రం…
నిజామాబాద్: ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. నగరంలోని ఫూలాంగ్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెయ్యి రోజులు గడిచిపోయాయని విమర్శించారు. హామీల అమలుపై ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా స్పందించకపోవడంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
“అయ్యా అంబేద్కర్ గారూ.. మీరైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడండి” అంటూ అంబేద్కర్ను వేడుకున్నామని గణేష్ బిగాల పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

























