బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది: గణేష్ బిగాల…
కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శ…
నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. నగరంలోని 12వ డివిజన్ ధర్మపురి హిల్స్లో యువ నాయకుడు ఎస్కే అమీర్ జలాల్ తన మద్దతుదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. సాధారణంగా ఏదైనా ప్రయోజనం పొందాలనుకునే వారు అధికార పార్టీలో చేరుతుంటారని, అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతుండటం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని గణేష్ బిగాల విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించడంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో మళ్లీ ఆదరణ పెరుగుతోందని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గణేష్ బిగాల అన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో బీఆర్ఎస్లో జరుగుతున్న చేరికలే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని, తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని గణేష్ బిగాల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నవీద్ ఇక్బాల్, సమీ, సనా ఉల్లా, సిర్ప రాజు, సుజిత్ సింగ్, ప్రభాకర్ రెడ్డి, దండు శేఖర్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

























