కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలి: గణేష్ బిగాల…
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు గణేష్ బిగాల డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరేట్ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గణేష్ బిగాల హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.

























