భీమ్గల్లో ఘనంగా డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్: భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను భీమ్గల్ పట్టణ కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమ్గల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ వస్తువులను పంపిణీ చేసి, మిఠాయిలు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిస్తున్న మార్గాన్ని, దేశ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అలాగే మార్చి నెలలో జరిగే పరీక్షల్లో భీమ్గల్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించే విద్యార్థికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపిక అందజేస్తామని ప్రకటించారు. దీంతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు, యోగేశ్వర నర్సయ్య, కొండ రాము గౌడ్, నవీన్, నీలం గంగాధర్, దయ ప్రవీణ్, గోపు సంజయ్, నరసయ్య, నరేందర్ గౌడ్, గంగాధర్, గౌతమి నర్సయ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























