Homeతెలంగాణబాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్ల ప్రతిపాదనలు...

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్ల ప్రతిపాదనలు…

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్ల ప్రతిపాదనలు…


త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్


బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల రెన్యువల్‌ పనులకు సంబంధించి సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, దెబ్బతిన్న రహదారులకు రెన్యువల్‌ పనులు చేపట్టాలని మంత్రిని కోరారు. ముఖ్యంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల వద్ద మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ కోరారు.

ఈ ప్రతిపాదనలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాదిత పనులను పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన పనులకు మంజూరు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు సునీల్ కుమార్ పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు పెండింగ్ పనుల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...
Translate »
error: Content is protected !!