సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న.శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని, భక్తులతో కలిసి భోజనం చేశారు. ఆలయ నిర్వాహకుల సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























