యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడటం ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో జరిగిన టీయూ పీడీఎస్యూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి.. విద్యార్థులకు మెరుగైన విద్యా, వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

























