ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్ అవ్వాలి-ఎస్సై వినయ్ కుమార్
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్ 25 త్రిశూన్యస్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తా లో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న పాఠశాల విద్యార్థుల చేత మానవహారంగా ఏర్పడి మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముందుగా నందిపేట్ పోలీస్ సిబ్బందితో మండల కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులంతా వివేకానంద చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి యువతా మేలుకో… మత్తు మాయ నీ బాటైతే… మృత్యు బాట నీదైతది…. నిషా సంస్కృతి – నీచ సంస్కృతి.. అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని మానవహారంగా ఏర్పడి ప్రతి ఒక్కరం మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజంలో మాదకద్రవ్యాలకు అలవాటు కాకుండా అవగాహన కల్పిస్తామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోతుందని, అందుకే సమాజంలో ప్రతి ఒక్కరికి మత్తు పదార్థాలపై, వాటి బారిన పడితే ఎటువంటి ఇబ్బందులకు గురవుతారు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున స్పందన రావడం చాలా సంతోషకరమని, విద్యార్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.























