ఆరోగ్యమే మహాభాగ్యం… ప్రజలకు జిల్లా వైద్యా & ఆరోగ్యశాఖ ధికారినీ డాక్టర్ బి రాజశ్రీ కీలక సూచనలు…
“ప్రతి సంవత్సరం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలను స్మరించుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారినీ డాక్టర్ రాజ శ్రీ ఇచ్చిన సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.”
“అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం లేదా నడక అలవాటు చేసుకోవాలి.
రోజుకు తగినంత నీరు తాగాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. కాలానుగుణంగా వచ్చే జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించాలి.
గర్భిణీలు, చిన్నారులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే ఉచిత వైద్య సేవలు, టీకాలు మరియు ఆరోగ్య పరీక్షలను వినియోగించుకోవాలి. అలాగే మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనలు పాటించాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను.
మరోసారి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా జీవించండి.”
“వైద్యుల సేవలను గౌరవిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకుందాం.

























