మైనర్లకు బైకులు ఇవ్వద్దు…. లేదంటే శిక్ష తప్పదు..,
త్రిశూల్ న్యూస్ నందిపేట్ మండల్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జులై 1 త్రిశూల్ న్యూస్; నందిపేట మండల కేంద్ర మోడల్ స్కూల్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తుండగా నలుగురు మైనర్ బాలురలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ దొరికిపోవడంతో వారిని స్టేషన్కు తీసుకెళ్లి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇస్తే ఆ పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే తీరని నష్టం జరుగుతుందని. అలాంటప్పుడు చిన్న పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని పట్టుబడ్డ పిల్లల తల్లిదండ్రులతో అసహనం వ్యక్తం చేశారు ఎస్సై వినయ్ కుమార్. ఇకపై చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిని ఉపేక్షించేది లేదని వారి తల్లిదండ్రుల పైన కూడా కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. అలాగే దత్తాపూర్లో జరిగిన మన ఊరు… మన భద్రత… మన బాధ్యత…. కార్యక్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక బాధ్యత తప్పనిసరిగా కలిగి ఉండాలని నాకెందుకులే అని అశ్రద్ధ చేయొద్దని, గ్రామంలో అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత సూచనలపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలపై మెలుకువగా ఉండి వాటి బారిన పడకుండా పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు అని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా నూతన ఎస్సై వచ్చినప్పటినుండి అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెడుతూ ప్రజలందరికీ సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.























