ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన భీంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
గత రెండు రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి పై ,టీపీసీసీ అధ్యక్షలు ,మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా భీంగల్ పట్టణ అధ్యక్షులు పర్స అనంత రావు మాట్లాడుతూ…… మా నాయకుల పైనా తప్పుగా ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించడం జరిగింది. అలాగే రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తో పోటీ పడే కనీస అర్హత నీకు లేదు అని నువ్వు రాజీనామా చేస్తే మా పార్టీ చిన్న కార్యకర్తతో నిన్ను ఓడించి తీరుతాం అని ఎద్దేవా చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ బొదిరే స్వామి మాట్లాడుతూ…. గతంలో 2021 లోనే కర్నూల్ జిల్లాలో అటవి చట్టాలు ఉల్లంఘించి ఎర్రచందనం అనుమతి లేకుండా తరలించినందుకు రిమాండ్ కు పోయిన నీవు మా నాయకుల గురించి మరోసారి మాట్లాడితే నిన్ను గాని మీ కార్యకర్తలను గాని వదిలిపెట్టమని హెచ్చరిస్తూ బీజేపీ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎంపీ లు రాష్ట్రానికి ఎంత నిదులు తీసుకొని వచ్చారో చర్చకు రావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర బాబు, మాజీ పట్టణ అధ్యక్షులు జే జే నర్సయ్య, మాజీ చైర్మన్ కన్నె సురేందర్, బాబాపూర్ గ్రామ సర్పంచ్ సమీర్, మెండోరా గ్రామ ఉపసర్పంచ్ కుంట రమేశ్, పన్నెండో వార్డు ఇంచార్జ్ సుంకరి సురేష్, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సురేష్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నిచ్చం మహేష్, మందుల కిరణ్, బొమ్మెన అజయ్, నవీద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.























