భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు..
ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా మంగళవారం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో అండగా నిలిచిన ఇండోనేషియాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజాస్వామ్య సారూప్యతలను ప్రధాని ప్రశంసించారు. 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత మోడీ చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. భారత్-ఇండోనేషియా సంయుక్తంగా హిందూ మహాసముద్రంలో సొంత హార్ముజ్ను సృష్టించనున్నాయి.

























