విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున 4.5 తీవ్రతతో భూమి కంపింది…
విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5:05 గంటల సమయంలో గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, తాటిచెట్లపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో నమోదైంది. భూకంప కేంద్రం కాకినాడకు తూర్పున సుమారు 227 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
ఈ భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

























