భీంగల్ మండలం కారేపల్లి బిట్ పరిధిలో చిరుత కాలేబరాన్ని వెలికితీసిన అటవీ శాఖ అధికారులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మండలం కారేపల్లి బిట్ పరిధిలో కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు చిరుతను చంపి అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కాలేబరాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో తాళ్లపల్లి, దేవక్కపేట గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అటవీ ప్రాంతం నుంచి వెలికితీసిన చిరుత కాలేబరానికి కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో పోస్టుమార్టం నిర్వహించారు.
ప్రాథమిక విచారణలో గొర్రెల కాపరులు మత్తు మందు కలిపిన ఆహారం పెట్టి చిరుతను చంపి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

























