Homeఆంధ్ర ప్రదేశ్హ హ హ హాసిని - హంతకురాలు భర్తను గుడికి తీసుకెళ్లిన భార్య.. బాయ్ ఫ్రెండ్...

హ హ హ హాసిని – హంతకురాలు భర్తను గుడికి తీసుకెళ్లిన భార్య.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి అతన్ని చంపేసింది..

_*హ హ హ హాసిని – హంతకురాలు..‼️*_

భర్తను గుడికి తీసుకెళ్లిన భార్య.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి అతన్ని చంపేసింది..


చిత్తూరు జిల్లా : గుడిపల్లి మండలం : ఆ తర్వాత ఏం తెలియనట్లు అక్కడి నుంచి భర్త బైక్‌పైనే ప్రియుడితో కలిసి పరారైంది..

భర్త ఏడాది బిడ్డతో కలిసి మల్లప్పకొండ దర్శనానికి వెళ్లిన భార్య మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చింది.. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

*వివరాల ప్రకారం..*

శాంతిపురం మండలం బోయినపల్లికి చెందిన హాసినికి తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్ తో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఏడాది కూతురు ఉంది. హోసూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రమేష్ హాసినిని పెళ్లి చేసుకుని భార్య బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. అయితే హాసిని చిన్ననాటి స్నేహితుడితో ఉన్న ప్రేమ బంధం కొనసాగించింది.. ఈ ప్రేమబంధం భార్యాభర్తల బంధానికి అడ్డుగా మారింది. 2024 లో రమేష్ తో పెళ్లి జరిగాక కూడా యుగంధర్ అనే యువకుడు అఫైర్ కంటిన్యూ చేస్తూ వచ్చిన హాసిని రెండు రోజుల క్రితం శాంతిపురం మండలంబోయినపల్లిలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చింది. తరచూ పుట్టింటికి వచ్చి స్థానికంగా ఉన్న యుగంధర్ ను కలుస్తూ వస్తున్న హాసిని భర్త రమేష్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం భర్త బైక్ పై బోయినపల్లికి వచ్చిన హాసిని మల్లప్ప కొండకు వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. భర్త రమేష్ బైక్ పై హాసిని ఏడాది కూతురుతో పయనమైంది. ఇంటి నుంచి మల్లేశ్వర స్వామి దర్శనం కోసం మల్లప్ప కొండకు బయలుదేరిన హాసిని బాయ్ ఫ్రెండ్ యుగంధర్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వచ్చింది. మల్లప్ప కొండకు ఎక్కుతూ మూడో టర్నింగ్ వద్ద ప్లాన్ చేసినట్టుగానే చేతిలో ఉన్న పర్స్ పడేసింది. పర్సు పడిపోయిందని బైక్ ను హాసిని ఆపేసింది. బైక్ ను అక్కడే వదిలి పడిపోయిన పర్సును తీసుకొచ్చేందుకు వెళ్లిన రమేష్ ను పట్టుకున్న యుగంధర్ బ్యాచ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళింది. అనంతరం యుగంధర్ తో పాటు ఉన్న నలుగురు కలిసి రమేష్ ను హతమార్చి డెడ్ బాడీని అక్కడే వదిలేశారు. అనంతరం రమేష్ బైక్ పైనే యుగంధర్ హాసినిని పికప్ చేసుకొని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు.

మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన రమేష్ ఫ్యామిలీ తిరిగి రాకపోవడంతో.. హాసిని తల్లి తన కూతురు కనిపించడం లేదంటూ నిన్న ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. మొదట భర్తతో వెళ్లిన దృశ్యాలు.. ఆ తర్వాత భర్త బైక్ పై మరో ఇద్దరు యువకులతో కలిసి హాసిని వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం.. మల్లప్ప కొండ పరిసరాల్లో రమేష్ డెడ్ బాడీని కూడా గుర్తించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

హాసినితో పాటు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. పక్కా ప్లాన్ తో హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రమేష్ హత్యపై రాళ్ళ బూదుగురు పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుప్పం డిఎస్పీ పార్థసారథి చెప్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...
Translate »
error: Content is protected !!