విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్…
భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ మండలం పురాణపేట గ్రామ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించి విద్యార్థుల బోధన, అభ్యాస పరిస్థితులను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా పురోగతిపై ఆరా తీశారు.
అనంతరం పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వారానికి మూడు రోజుల పాటు గుడ్డు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు.
పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం అత్యంత ముఖ్యమని ఎంపీడీఓ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర సుమ, దేవేందర్ గౌడ్, ఏపీఓ నర్సయ్య, గ్రామ సర్పంచ్ సుమ, ఇన్చార్జి హెచ్ఎం సౌజన్య, పంచాయతీ కార్యదర్శి మాలేపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

























