ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఎన్నికలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్లలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
పాఠశాలకు హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ అదేవిధంగా నాలుగు హౌసెస్ కెప్టెన్లుగా ఎన్నికలను అతి రసవత్తరంగా నిర్వహించడం జరిగింది. ఫలితాలలో హెడ్ బాయ్ గా 10వ తరగతి కి చెందిన రంజిత్, హెడ్ గర్ల్ గా 10వ తరగతి కి చెందిన అశ్విని గెలుపొందారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియను కళ్ళకు కట్టేలా ఈ ఎలక్షన్ నిర్వహణ జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా
విద్యార్థులకు ఎన్నికలు జరిగే విధానం, ఓట్లు వేసే పద్ధతి, మొదలైన విషయాలను అనుభవాపూర్వకంగా విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది.
ఇందులో విద్యార్థులే ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్లుగా, పోలింగ్ అధికారులుగా, పోలింగ్ ఏజెంట్లుగా విద్యార్థులు పాల్గొని ఎన్నికలను నిర్వహించడం జరిగింది.
పిల్లలందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేయడం జరిగింది. విద్యార్థులు ఎన్నికల సరళిని, ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు వంటి అంశాలను ప్రత్యక్ష అనుభూతిని పొందారు. ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యతను, ఓటు విలువను గ్రహించారు.
సాధారణ ఎన్నికలను తలపించేలా ఈ ఎలక్షన్లు నిర్వహించారు. ఓటింగ్ లో పాల్గొన్న విద్యార్థులకు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా చుక్కను అంటించారు. బ్యాలెట్ పేపర్లను తయారు చేసి ఇవ్వడంతో పాటు దానిపై ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తును తయారు చేయించారు.
పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పర్యవేక్షణలో ఈ ఎన్నికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఆనంద్ రావు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మునిరుద్దీన్, ప్రసాద్, సమిత,
విజయ్, శ్రీనివాస్, గంగాధర్, ప్రవీణ్ శర్మ, జ్యోతి, ట్వింకిల్, గంగా మోహన్, రిషిక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

























