భీంగల్ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వహిస్తున్న కోట నర్యయ్య అనారోగ్యంతో ఈరోజు మృతి చెందారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన భీంగల్ మున్సిపల్ యూనియన్ నాయకులు, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా భీంగల్ మున్సిపల్ యూనియన్ తరపున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని నర్యయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ మాట్లాడుతూ, కోట నర్యయ్య మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఆయన కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ సభ్యులు పల్లికొండ శ్రీధర్, పతాని నవీన్. బచ్చల వారి విశ్వనాథ్,జంబుక రాజారాం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























