పోనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి.ఆర్మూర్ డిపో మేనేజర్కు ఏర్గట్ల మండల సర్పంచుల వినతి…
బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల పరిధిలో నిలిపివేసిన పోనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ మండలంలోని సర్పంచులు ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. గతంలో పోనకల్ నుంచి హైదరాబాద్కు బస్సు సర్వీసు ఉండేదని, గుమ్మిరియాల్లో నైట్ హాల్ట్ బస్సు కూడా ఉండేదన్నారు. ప్రస్తుతం నైట్ బస్సు లేకపోవడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తిరిగి నైట్ హాల్ట్ బస్సును ఏర్పాటు చేయాలని కోరారు.
పోనకల్ నుంచి హైదరాబాద్కు నడిచే బస్సు సర్వీసు ఏర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మూడు మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. అలాంటి బస్సు సర్వీసును ఒక్కసారిగా రద్దు చేయడం సరికాదన్నారు. అన్ని గ్రామాలను కలుపుతూ నిజామాబాద్కు రోజుకు రెండు నుంచి మూడు ట్రిప్పులు నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
ప్రజలు, రైతులు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిలిపివేసిన బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు దేశబోయిన జమున, సంజీవ్ యాదవ్, కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, భూషణ వేణి, ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ చాట్ల జనార్ధన్ పాల్గొన్నారు.

























