రోడ్డుమీదే వాడిన సిరంజీలు…. పట్టించుకున్న నాథుడే లేడు….
మొన్న నంది విగ్రహం వద్ద… నిన్న వాల్గొట్ బంగ్లా వద్ద….
కరువైన వైద్యాధికారుల నిఘా….
గ్రామపంచాయతీకి బాధ్యత లేదా….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…

నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా రోడ్లపైనే మెడికల్ వేస్టేజ్ ( వాడిన సిరంజీలు, సూదులు ) లను పడేస్తున్న ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోకపోవడం విడ్డూరం. మొన్న పంద్రాగస్టు రోజున పిల్లలంతా జెండాలు పట్టుకొని స్వాతంత్ర నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరే సమయానికి నంది విగ్రహం వద్ద నడిరోడ్డుపై ఉపయోగించిన సిరంజీ సూదులు విచ్చలవిడిగా పడేసి ఉన్నాయి. ఎవరు పడేసారో తెలియదు, పడేసిన వారిపై ఎటువంటి చర్యే లేదు, నిన్న శుక్రవారం రోజున కూడా ప్రభుత్వ పాఠశాల దగ్గర గల వాల్గట్ బంగ్లా వద్ద ఉపయోగించిన సిరంజీలు, సూదులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. నందిపేట డొంకేశ్వర్ మండలాలలో విచ్చలవిడిగా గల్లీకో దవఖానాతో ఎటువంటి అనుమతులు లేకుండా, చికిత్స చేస్తూ.. ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిన ఆర్ఎంపి, పిఎంపీలు మోతాదుకు మించి స్టీరెడ్లతో చికిత్సలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోగా గ్రామ పరిశుభ్రతను చెరిపేస్తూ.. బాధ్యతారహితంగా ఇలా రోడ్లపై మెడికల్ వేస్టేజ్లను పడేసే వారిని ఉపేక్షించకుండా వెంటనే వారిపై చర్య తీసుకునేలా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేస్తామని చెప్పిన ప్రజా ప్రతినిధులపై, తప్పు చేసిన వారిపై చర్య తీసుకొని అధికారులపై జిల్లా ఉన్నతాధికారులైన దృష్టి సారిస్తే గాని ఇటువంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

























